ప్రజలను అప్రమత్తం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలను అప్రమత్తం చేయాలి

May 2 2025 1:15 AM | Updated on May 2 2025 1:15 AM

ప్రజలను అప్రమత్తం చేయాలి

ప్రజలను అప్రమత్తం చేయాలి

నస్రుల్లాబాద్‌ (బాన్సువాడ): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, సైబర్‌క్రైమ్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు వారికి అవగాహన కల్పించాలని ఎస్పీ ఎం రాజేశ్‌చంద్ర సూచించారు. నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డ్‌లు, రిసెప్షన్‌, టెక్‌ టీమ్‌, లాక్‌ అప్‌ రూమ్‌, పార్కింగ్‌ పరిసరాలను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్‌ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సిబ్బందికి సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు విస్తృతంగా చేపడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, గ్రామాల్లో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట బిచ్కుంద సీఐ నరేశ్‌, ఎస్సై లావణ్య, ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement