
హరితహారం చెట్ల నరికివేత
పట్టించుకోని అటవీ
శాఖాధికారులు
పెద్ద ఎత్తున రోడ్లకు ఇరువైపులా చెట్లు నరికివేతకు గురవుతున్నా ఇటు పంచాయతీ అధికారులతో పాటు అటు అటవీ శాఖాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత స్థలాల్లో పెరిగిన చెట్లను తొలగించడానికి అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురి చేసే అధికారులు.. ఎంతో ప్రజాధనం వెచ్చించి హరితహారంలో భాగంగా పెంచిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్నా కనీసం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికా రులు స్పందించి చెట్ల నరికివేతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమి కులు కోరుతున్నారు. చెట్లు నరికివేతకు గురవుతున్న విషయంపై ఎంపీడీవోను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామని, అవసరమై తే కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.
భీమ్గల్ః పచ్చదనాన్ని పెంపొందించేందుకు గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది వానాకాలంలో ప్రజలందరిని భాగస్వాములను చేస్తూ, అధికారులు, ప్రజాప్రతినిధు లు అందరు కలిసి ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల తో పాటు, పొలాలు, చెరువు గట్లపై అట్టహాసంగా మొక్కలు నాటారు. తీరా అవి పెరిగి పెద్దగయ్యే సరికి విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయనే కారణంతో విద్యుత్ శాఖ అధికారులు అడ్డూ అదుపూ నరికేస్తున్నారు. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో పదేళ్ల క్రితం నాటిన మొక్కలు పెరిగి పెద్దవి కాగ విద్యుత్ అధికారులు తీగలకు అడ్డువస్తున్నాయని నరికేస్తున్నారు. గతంలో ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ అధికారులు గ్రామాల్లో రోడ్లకు ఇరువైపు లా మొక్కలను నాటించారు. వాటిలో దాదాపు 80 శాతం మొక్కలు ఏపుగా పెరిగాయి. గతంలో రోడ్ల కు ఇరువైపులా ఉన్న చెట్లను చాలా సార్లు నరికేశా రు. కొమ్మలను నరికితే పోయేదానికి ఇష్టానుసారంగా చెట్ల మొదళ్ల నుంచి నరుకుతూ చేతులు దులుపుకుంటున్నారు.
కన్నెత్తి చూడని జీపీ అధికారులు
గ్రామాల్లో సంవత్సరాల నుంచి పెంచిన హరితహా రం చెట్లను యథేచ్చగా నరికేస్తున్నా ఎంపీడీవో, పంచాయతీ సెక్రెటరీలు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. విద్యుత్ శాఖ అధికారుల ఆదేశంతో చిగురించేందుకు వీలు లేకుండా మొదళ్ల వరకు నరికేస్తున్నారు. తీగలకు తగిలే కొమ్మలను తొలగించకుండా మొత్తం చెట్లను నరికివేస్తుంటే అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పొయ్యిలో కట్టెలుగా మారిన హరితహారం మొక్కలు
ముందుచూపు లేని ప్రభుత్వ అధికారులు
విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటిన వైనం
తీరా అవి చెట్లుగా మారే సమయానికి అడ్డుగా వస్తున్నాయని నరికేస్తున్న
విద్యుత్ శాఖాధికారులు