విద్యార్థినిపై అత్యాచార యత్నం

అధ్యాపకుడికి దేహశుద్ధి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని ఓ ప్రైవేటు ఒకేషనల్‌ కళాశా ల అధ్యాపకుడు, మరో ప్రైవేటు కళాశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేయబోవడంతో పాటు, వేధిస్తుండడంతో స్థానికులు బుధవారం దేహశుద్ధి చేశారు. వివరాలు.. మంగళవారం ఇంటర్‌ పరీక్షలు రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని సదరు అధ్యాపకుడు తాను అటువైపే వెళ్తున్నాని, బైక్‌పై దింపుతానని చెప్పాడు. దీంతో ఆమె బెక్‌పై ఎక్కగా.. గ్రామ శివారు దాటగానే అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లే యత్నం చేయగా బాలిక తప్పించుకుని పారిపోయింది. బుధవారం మళ్లి బాలికను వేధించే ప్రయత్నం చేయడంతో గమనించిన స్థానికులు అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

భిక్కనూరు: మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆనంద్‌గౌడ్‌ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన పెనోళ్ల లక్ష్మణ్‌ (40) కుటుంబ అవసారాల కోసం, భార్య ఆరోగ్యం బాగుకోసం అప్పులు చేశాడు. ఈ విషయమై తరచు బాధపడేవాడు. బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, కుమారుడు శ్రావణ్‌ ఉన్నారు. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

Read latest Kamareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top