సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు

Jun 25 2025 1:27 AM | Updated on Jun 25 2025 12:55 PM

ఽదరూరు: ఆయిల్‌పాం తోటల సాగులో రైతులు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నీలహళ్లి తదితర గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ పద్ధతులను వివరించారు. ఆయిల్‌పాం తోటల సాగుకు సంబంధించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు రాజారెడ్డి, మండల ఫీల్డ్‌ ఆఫీసర్‌ శివ, అశోక్‌ పాల్గొన్నారు.

చేనేత రుణమాఫీకి అర్హుల గుర్తింపు

రాజోళి: చేనేత కార్మికుల రుణమాఫీ పథకంలో అర్హులైన వారిని గుర్తించేందుకు చేనేత, జౌళి శాఖ అధికారులు మంగళవారం రాజో ళిలోని యూనియన్‌ బ్యాంకుకు వచ్చారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన క్రమంలో ఏడీ గోవిందయ్య ఆధ్వర్యంలో బ్యాంకులో ఉన్న చేనేత కార్మికుల వివరాలను పరిశీలించారు. నిరుపేద కార్మికులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం చేసిన రుణమాపీ పథకం ద్వారా బ్యాంకులో ఉన్న 600 ఖాతాల్లో అర్హులెవరో తేల్చేందుకు కార్మికుల పత్రాలను పరిశీలించారు. పత్రాల పరిశీలన అనంతరం నివేదికను పైఅధికారులకు అందజేయన్నునట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర పాల్గొన్నారు.

అన్నివర్గాలకుసమప్రాధాన్యం

ధరూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల పక్షపాతి అని.. దేశంలోని అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం మండలంలోని భీంపురం, ఉప్పేరు గ్రామాల్లో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా ఉజ్వల పథకంతో గ్యాస్‌ సిలిండర్లు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంతో నిరుపేదలకు పక్కా గృహాలు, ప్రతినెలా ఉచితంగా రేషన్‌ బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు.

ఫసల్‌ బీమా యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి, పంటలకు మద్దతు ధర పెంపు వంటి అనేక కార్యక్రమాలతో రైతులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఎక్బొటే, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ బండల వెంకట్రాములు, నాయకులు రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, రాజేశ్‌, హన్మంతరాయ, రఘుగౌడ్‌, శేఖర్‌రెడ్డి, వేమారెడ్డి, మోతీలాల్‌, పాండు ఉన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు

ఎర్రవల్లి: మండలంలోని జింకలపల్లి సమీపంలో ఉన్న ఎస్‌ఎన్‌ఎస్‌ స్టార్చ్‌ కంపెనీలో మంగళవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్‌ సురేశ్‌బాబు, శాస్త్రవేత్త విద్యులత తనిఖీలు చేపట్టారు. కంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో సమీపంలోని వ్యవసాయ పొలాలతో పాటు చెరువు కలుషితమవుందని ఇటీవల రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు కంపెనీలో తనిఖీలు చేపట్టడంతో పాటు వ్యవసాయ పొలాల్లో నీటి శాంపిల్స్‌ సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని.. రిపోర్టుల ఆధారంగా కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు 1
1/2

సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు

అన్నివర్గాలకుసమప్రాధాన్యం2
2/2

అన్నివర్గాలకుసమప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement