సాగవుతున్నా పడావుగా చూపించారు.. | - | Sakshi
Sakshi News home page

సాగవుతున్నా పడావుగా చూపించారు..

Jun 25 2025 1:27 AM | Updated on Jun 25 2025 1:27 AM

సాగవుతున్నా పడావుగా చూపించారు..

సాగవుతున్నా పడావుగా చూపించారు..

నాకు చౌదర్‌పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్‌ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్‌ కల్టివేటింగ్‌) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది.

– భాగ్యమ్మ, చౌదర్‌పల్లి, దేవరకద్ర

అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి..

2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విషయం తెలియక పంట ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్‌ అధ్యక్షుడు

30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ

జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరోసా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబితా రూపొందించి కలెక్టర్‌కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – బి.వెంకటేష్‌,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement