శ్యాంప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం

Jun 24 2025 3:37 AM | Updated on Jun 24 2025 3:37 AM

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం

గద్వాలటౌన్‌ : జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ చిత్ర పటానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ పండిట్‌ నెహ్రూ క్యాబినెట్‌లో విదేశాంగ మంత్రిగా సేవలందించారని, అనంతరం జన్‌సంఘ్‌ పార్టీని స్థాపించి దేశాభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారన్నారు. దేశం గర్వించదగిన నేతల్లో శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒకరని కొనియాడారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వార్డుల వారిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవికుమార్‌, బండల వెంకట్రాములు, రమాదేవి, జయశ్రీ, నర్సింహులు, దేవదాసు, అనిల్‌, చిత్తారికిరణ్‌, శ్రీనివాసులు, నర్సింహా,కృష్ణ, మోహన్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement