తెలంగాణ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నెట్టెంపాడు ఎతిపోతల పథకం ద్వారా కృష్ణానది నీటిని మొదట ర్యాలంపాడు రిజర్వాయర్లో నింపుతారు. అక్కడి నుంచి తాటికుంట, ముచ్చోనిపల్లి, నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపుతున్నారు. అధికారుల అవగాహన లోపం వలన రైతులకు నీటి అవసరం లేకున్నా గేట్లు మూయకపోవడంతో భవిష్యత్తులో ఉపయోగపడాల్సిన నీరు వృథాగా వాగులు, వంకల పాలవుతోంది. అధికారులు నీటి వృథాను అరికట్టాలి.
– మేకల నాగరెడ్డి,
రైతు సంఘం అధ్యక్షుడు, అయిజ
పంట కాల్వలు నిర్మించాలి
రిజర్వాయర్ పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పంట పొలాల్లో పంట కాలువలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు పంట పొలాలకు సాగునీరందించేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. పెద్ద కాల్వ నుంచి పంట పొలంలోకి నీరు తెచ్చే క్రమంలో నీరు వృథాగా పోతుంది. దీంతో పక్క పొలం రైతులకు నష్టం జరుగుతుంది. అధికారులు స్పందించి పంట కాల్వ పనులు సకాలంలో పూర్తిచేయాలి.
– గోవిందు, రైతు, అయిజ
నీటి వృథా అరికడతాం..
నీటిని విడుదల చేసే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. దానిలన నీటివిడుదల విషయంలో అంత ఖచ్చితంగా పనులు నిర్వర్తించలేకపోతున్నారు. రైతులు వచ్చి షెట్టర్లు పైకి ఎత్తి ఎక్కువ మొత్తంలో నీరు విడుదల చేసుకపోతుంటారు. దాన్ని అరికట్టేందుకు సిబ్బంది తక్కువగా ఉండడంతో ఇలా జరుగుతుంది. వెంటనే నీటి వృథాను అరికడతాం.
– రాంబాబు, ఏఈఈ
●
అధికారుల అవగాహన లోపం..