ఇంటర్‌ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం

Apr 23 2025 9:42 AM | Updated on Apr 23 2025 9:42 AM

ఇంటర్‌ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం

ఇంటర్‌ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో సంచలనం సృష్టించారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటినట్లు కళాశాల చైర్‌పర్సన్‌ చంద్రకళా వెంకటయ్య తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో భావన 468 మార్కులు సాధించగా.. మరో ఏడుగురు విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీలో మలిహా కహేకశ 438 మార్కులు సాధించగా.. ముగ్గురు 437, మరో ముగ్గురు 436 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మేఘన 993తో పాటు మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. బైపీసీలో మలిహ తహనీయత్‌ 992 మార్కులు, మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల అడ్వైజర్‌ వెంకటయ్య, అకాడమిక్‌ డీన్‌ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ డీన్‌ భూపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రసన్నలక్ష్మి, రాఘవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement