అట్టహాసంగా కళాఉత్సవ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా కళాఉత్సవ్‌ పోటీలు

Nov 15 2023 1:14 AM | Updated on Nov 15 2023 1:14 AM

విద్యాశాఖ అధికారులతో కళాఉత్సవ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు - Sakshi

విద్యాశాఖ అధికారులతో కళాఉత్సవ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

గద్వాల అర్బన్‌: విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కళాఉత్సవ్‌ పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. ఈ పోటీలకు డీఈఓ సీరాజుద్దీన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళ రంగాల్లో రాణించాలని సూచించారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జానపద, శాసీ్త్రయ పాటలు, నృత్యాలు, త్రీడీ చిత్రలేఖనం, వాయిద్య తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్‌ అధికారులు ఏస్తేరురాణి, హంపయ్య, మాధవి, సుజాత, జయప్రకాష్‌, కృష్ణ, రామాంజనేయలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement