
ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రత
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంలను గురువారం కలెక్టర్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ అంశాలను ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈతనిఖీలో ఎన్నికల విభాగం డీటీ అబ్బాస్, ఐటీ పర్సన్ నవీన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.