
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..
భూపాలపల్లి అర్బన్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ ఆశోక్కుమార్ సూచించారు. జిల్లా నాషాముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో గురువారం ముగింపు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, జిల్లా అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి హాజరై మాట్లాడారు. యువతను మాదకద్రవ్యాల వ్యసనాల నుంచి దూరంగా ఉంచే దిశగా చేపట్టిన చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎకై ్సజ్ సూపరిండెంట్ శ్రీనివాస్, సీడీపీఓ మహదేవపూర్ రాధిక, సూపర్వైజర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతులను
జయప్రదం చేయాలి
భూపాలపల్లి రూరల్: ఈనెల 28, 29న డాన్ బాస్కో హాల్ ప్రగతినగర్ రామంతపూర్ హైదరాబాద్లో జరిగే సేవాలాల్ సేన రాష్ట్రస్థాయి సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులను జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోశ్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య సురేశ్నాయక్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన రాష్ట్రస్థాయి సామాజిక రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సేవలాల్ సేన పట్టణ అధ్యక్షుడు నరేశ్నాయక్, రాష్ట్ర నాయకుడు రాజు, సేవాలాల్ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు నవీన్ మహేశ్, ఘనపూర్ నాయకులు రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
భూపాలపల్లి రూరల్: బీజేపీ భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శులుగా కరివేద మనోహర్రెడ్డి, జోరు కృష్ణ, శీలం రాజును ఎన్నుకున్నట్లు అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా నాయకులు దొంగల రాజేందర్, బట్టు రవి, అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
టస్సార్ కాలనీని
సందర్శించిన ఏపీ మహిళలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని టస్సార్ (దసలిపట్టు) కాలనీని ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సహాయ పట్టు పరిశ్రమ అధికారి జీవీ హరికృష్ణ ఆధ్వర్యంలో చింతూర్, రంపచోడవరానికి చెందిన సుమారు 60 మంది మహిళలు గురువారం సందర్శించారు. ఈసందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను, తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. కాలనీకి చెందిన చేనేత కార్మికులు గొర్రె బాపు, శంకరయ్య, శ్రీనివాస్ దసలి పట్టు పరిశ్రమ, టస్సార్ మహిళలు (దసలిపట్టు) దారం తీసే విధానం, మగ్గాలపై చీరెలు నేసే విధానాన్ని క్షుణ్ణంగా వారికి అర్థమయ్యేలా వివరించారు. కార్యక్రమంలో మండల సెరికల్చర్ అధికారి సమ్మయ్య, పట్టుపరిశ్రమ సాంకేతిక సహాయకుడు రవికుమార్, సారయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..