
పుష్కరస్నానం ఆచరించిన సీఎస్ దంపతులు
కాటారం/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దంపతులు, ప్రత్యేక సీఎస్ వికాస్రాజ్ దంపతులు హాజరయ్యారు. సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో వారు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి రాగా ఆలయ అధికారులు, అర్చకులు వడివట్టం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు సీఎస్ దంపతులకు సరస్వతి మాత చిత్రపటాన్ని బహుకరించారు.