తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

May 3 2025 7:52 AM | Updated on May 3 2025 7:52 AM

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

కాళేశ్వరం: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపా రు. మహదేవపూర్‌ మండల కేంద్రంలోని ఎర్ర చెరు వు సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గు రువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధా న్యాన్ని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తడిసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నష్టపోయిన రైతుల పంటల వివరాలను నమో దు నివేదిక అందించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్‌, డీఎం రాములు, సహకార శాఖ అధికారి వాల్యనాయక్‌, తహసీల్దార్‌ ప్రహ్లాద్‌ రాథోడ్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

భూపాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలైన అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి

వేసవినేపథ్యంలో ప్రజలు ఎండల నుంచి రక్షణ పొందేందుకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, వడదెబ్బ తగలకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు 108 నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. నిల్వ ఉన్న ఆహారం, వేపుళ్లు, ఆరు బయట ఆహార పదార్థాలు తినొద్దని తెలిపారు.

ఒక మండలాన్ని ఎంపిక చేయాలి..

మే 5 నుంచి 20 వరకు జిల్లాలోని ఒక మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, నీట్‌ పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టరేట్‌నుంచి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement