నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

May 3 2025 7:52 AM | Updated on May 3 2025 7:52 AM

నర్సర

నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

డీపీఓ వీరభద్రయ్య

రేగొండ: వేసవిలో నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య సూచించారు. మండలంలోని రంగయ్యపల్లి గ్రామపంచాయతీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలోని పలు రికార్డులను పరి శీలించారు. అలాగే సెగ్రిగేషన్‌ షెడ్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. అనంతరం కొడవంటచ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ రాంప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి జీవిత పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

మల్హర్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. మండలంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాడిచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించి ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ట్యాబ్‌ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించా రు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా తక్షణమే కేటా యించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో తాలు, తరు గు పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేయొద్దని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్య త లేదని కేంద్రాలు ఇన్‌చార్జ్‌లు పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. సబ్‌ కలెక్టర్‌ మాయంక్‌సింగ్‌, డీఎస్‌ఓ శ్రీనాథ్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, రైతులు పాల్గొన్నారు.

నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
1
1/1

నర్సరీల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement