ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

Mar 5 2025 1:26 AM | Updated on Mar 5 2025 1:21 AM

రేగొండ: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడెపాక గ్రామంలో ప్రతిష్ఠించిన రేణుకా ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కొంగుబంగారంగా రేణుక ఎల్లమ్మ నిలిచిందన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గూటోజు కిష్టయ్య, నాయకులు పున్నం రవి, సూదనబోయిన ఓంప్రకాశ్‌, సురేందర్‌రెడ్డి, ఓమాజీ, మెండయ్య, తిరుపతి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement