
ప్రభుత్వం విద్యా విధ్వంస విధానాలను మానుకోవాలి
● విద్యా పరిరక్షణ కమిటీ బాధ్యులు
జనగామ రూరల్: కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను మానుకోవా లని విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.లక్ష్మయ్య, ఇ.రామిరెడ్డి అన్నారు. హైదరా బాద్ ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న నిర్వహించే ధర్నా కరపత్రాలను గురువారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణను వేగిరం చేయడానికి నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువ చ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసిన గత సర్కారు విధానాలనే ప్రస్తుత ప్రభు త్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు అన్ని స్థాయిల్లో దళిత, ఆదివాసీ, నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు విద్యను దూరం చేసేలా ఉన్నాయ న్నారు. రాజు, అంకుశావళి, యాదగిరి, శివరాం, జి.శ్రీరామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.