
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
జనగామ రూరల్ : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యువత పోరాడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియో గం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ, విద్యా, వైద్యం, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండరి నితిన్ చేతన్తోపాటు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ టీచ ర్లు, ఆశ వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బస్టాండ్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంత రం ర్యాలీ కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను తెల్లకాగితంపై రాసి పోస్ట్బాక్స్లో వేయాలని, ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు ఇస్తామన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, జిల్లా సంక్షేమాధికారి ఫ్లోరెన్స్, డీఎంహెచ్ ఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి :
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నా రు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన డీఏడబ్ల్యూఎన్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్–2025పై శామీర్పేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటికి బానిస కావొద్దని సూచించారు. మాదకద్రవ్యాలు అమ్మేవారు చిన్న పిల్లలను టార్గెట్ చేస్తారని అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు వివరించారు. ఏ రూపంలోనైనా మత్తు పదార్థాలు ఉండవచ్చని జాగ్రత్తగా ఉండాల ని చెప్పారు. ద్విచక్ర వాహనాలపై లిఫ్ట్ ఇస్తాను అంటే బాలికలు వెళ్లకూడదని పేర్కొన్నారు. అలాగే బాల్య వివాహాలపై మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయ సు లోపు వివాహం చేసుకోవద్దని, అలా వివాహం చేసిన వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నీరజ, భీమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం