బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

Jun 27 2025 4:32 AM | Updated on Jun 27 2025 4:32 AM

బతుకమ

బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

జనగామ రూరల్‌ : పట్టణంలోని బతుకమ్మకుంటలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచా లని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. గురువా రం అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌తో కలిసి పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు రూ.కోటి 50 లక్షల నిధులు మంజూరయ్యాయని, పంచతంత్ర థీమ్‌తో అభివృద్ధి చేయాలని చెప్పారు. సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్‌, వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆటస్థలం, ఆట పరికరాలు, చిన్న పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చెరువు పూడికతీత పనులు, వాకింగ్‌ ఏరియా, లైటింగ్‌, ఫెన్సింగ్‌, ఒక వాటర్‌ ట్యాంక్‌ పనులు పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అకాల వర్షాల వల్ల చెరువు పూడికతీత పనులు ఆలస్యం కావడంతో సివిల్‌ పనులు చేసేందుకు వీలు కాలేదని పేర్కొన్నారు. వారి వెంట మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్‌కుమార్‌, ఏఈ మహిపాల్‌ పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

బచ్చన్నపేట: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండా లి.. ఇందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపరాణి సూచించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంత రం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై సూచనలు చేశారు. డీఎల్పీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్‌ పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు

నర్మెట: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు.. తడి పొడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువు పంచాయతీలకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతుందని ఎస్‌ఎస్‌జీ డీసీ పి.శ్రీకృష్ణ, ఎస్‌బీఎం డీసీ రామగుండం కరుణా కర్‌ అన్నారు. మండల పరిధి బొమ్మకూర్‌, బొమ్మకూర్‌తండా, రాళ్లబాయితండాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్లు, ఇంకుడుగుంతలు తదితర అభివృద్ధి పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యదర్శి సుజాతకు పలు సూచనలు చేశారు. భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలని, వృక్షసంపదను పెంచాలని చెప్పారు. అనంతరం రాళ్లబాయితండా ఎంపీపీఎస్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడా రు. హెచ్‌ఎం బిర్రు ఉప్పలయ్య పాల్గొన్నారు.

లబ్ధిదారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

పాలకుర్తి: గిరిజన లబ్ధిదారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని హనుమకొండ, జనగామ జిల్లాల అసిస్టెంట్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ బానోతు రూపాదేవి అన్నారు. మండల పరిధిలో ఎంపిక చేసిన కొండాపురం, మైలారం గ్రామాల్లో గురువారం ఎంపీడీఓ రాములు ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంపీఓ రవిందర్‌, జీపీ కార్యదర్శి యూసుఫ్‌, మాజీ సర్పంచ్‌ కిషన్‌, లక్‌పతి గుగులోతు పాటిల్‌, కమిటీ చైర్మన్‌ రామ్‌సింగ్‌, ఏఈఓ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

బోనస్‌ జమచేయాలి

జనగామ రూరల్‌: ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యానికి సంబంధించిన బోనస్‌ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్‌ ఏఓ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చందునాయక్‌ మాట్లాడుతూ రైతులు పండించే దొడ్డు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం సన్న రకానికే అమలు చేస్తోందన్నారు. జిల్లాలో రైతులకు సుమారు రూ.12 కోట్ల బోనస్‌ డబ్బులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు బోనస్‌ అమలు చేయాలని, లేదంటే తహసీల్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, నాయకులు కర్రె రాములు, కర్ర బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌ 
1
1/2

బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌ 
2
2/2

బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement