సేంద్రియ సాగును ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగును ప్రోత్సహించాలి

Jun 27 2025 4:32 AM | Updated on Jun 27 2025 4:32 AM

సేంద్రియ సాగును ప్రోత్సహించాలి

సేంద్రియ సాగును ప్రోత్సహించాలి

ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి టౌన్‌: సేంద్రియ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతోనే మానవ మనుగడ సాధ్యమని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కల్పించి రైతులను ప్రొత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చుడాలని తెలిపా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్‌, ఏడీఏ అజ్మీరా పరశురాంనాయక్‌, ఏఓలు శరత్‌చంద్ర, దివ్య, విజయ్‌రెడ్డి, వీరభద్రం, రామనర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement