లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Jun 12 2025 7:33 AM | Updated on Jun 13 2025 2:33 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్‌ ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ను వేది కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

లోక్‌ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, న్యాయస్థానంలో పెండింగ్‌ ఉన్న కేసు లోక్‌ అదాలత్‌కు వచ్చిన తర్వాత పరిష్కారమైతే కోర్టులో చెల్లించిన రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లిస్తారని తెలిపారు. సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందని, రాజీ పడదగిన క్రిమినల్‌, సివిల్‌, కుటుంబ తగాదాలు, డబ్బు రికవరీ, మోటార్‌ వెహికల్‌ యాక్సిడెంట్‌, చిట్‌ ఫండ్‌, ఎలక్ట్రిసిటీ, చెక్‌బౌన్స్‌ కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు.

పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించాలి

కొడకండ్ల : ప్రీస్కూల్‌ పిల్లలందరినీ తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సీడీపీఓ సత్యవతి కోరారు. ‘అమ్మమాట–అంగన్‌వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా బుధవా రం మండలకేంద్రంలో ఇంటింటికీ తిరిగి అడ్మిషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ఈనెల 17 వరకు నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి అర్హత కలిగిన పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలని చెప్పారు. అలాగే అవగాహన ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అంది స్తున్న సేవలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సరళ, అంగన్‌వాడీ టీచర్లు మైమూదాబేగం, సరిత, ఉప్పలక్ష్మి, వినోద, నర్సమ్మ, మంజుల, మాధవి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్యకు అనుమతి లేదు : డీఈఓ

జనగామ: పట్టణంలో శ్రీ చైతన్య పేరుతో ఎలాంటి ప్రైవేట్‌ స్కూల్‌ అనుమతి లేదు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ భోజన్న తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీచైతన్య పేరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వైష్ణవి స్కూల్‌ పేరుతోనే రన్‌ చేయాలని, ఒక వేళ అలాగే కంటిన్యూ చేస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. రికగ్నైజేషన్‌ లేకుండా ప్రైవేట్‌ స్కూళ్ల ను నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని, ప్రీ ప్రైమరీ స్కూల్‌ యాజమాన్యాలు సైతం తమ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్కావెంజర్లకు సంబంధించి మూడు నెలల వేతనం రెండు, మూడు రోజుల్లో రానున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం వండి వడ్డించే గ్రూపులకు బకాయి ఉన్న సుమారు రూ.3కోట్ల బడ్జెట్‌ కూడా త్వరలో రిలీజ్‌ అవుతుందని అన్నారు.

కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం పర్యటన

లింగాలఘణపురం: మండలంలో బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందం పర్యటించింది. లింగాలఘణపురం, నెల్లుట్ల, నవాబుపేట, నేలపోగుల, కొత్తపల్లి, గుమ్మడవెల్లి, సిరిపురం, కళ్లెం, నాగారం గ్రామాల్లో నిర్మించిన సోక్‌పిట్స్‌, మ్యాజిక్‌ సోక్‌ పిట్స్‌, కమ్యూనిటీ సోక్‌పిట్స్‌, ప్లాంటేషన్‌, వాటర్‌ రీజార్జ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు, సైంటిస్ట్‌ సెంటర్‌ వాటర్‌ బోర్డు వెంకటగిరి, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వెంకన్న, డీఆర్‌డీఓ సరిత, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, ఎంపీఓ రఘురామకృష్ణ, ఏపీఓ బిక్షపతి పాల్గొన్నారు.

ఉపాధి పనుల పరిశీలన

కొడకండ్ల : ఏడునూతుల, కొడకండ్ల గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు జాయింట్‌ డైరెక్టర్‌ పుష్పలత కుమారి, సీనియర్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస ర్‌ అంకిత్‌ బుధవారం పర్యటించారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్‌ డ్రెయిన్‌ పనులను పరిశీలించారు. ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు, ఉపాధి కూలీలతో మాట్లాడి జాబ్‌కార్డుల అప్‌డేషన్‌, సెవెన్‌ రిజిస్టర్లతోపా టు సడక్‌ యోజన కింద చేపట్టిన రోడ్ల నిర్మాణాల గురించి తెలుసుకున్నారు. డీపీఎం వినితరెడ్డి, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఎంపీఓ ఇందిర, ఏపీఓ కుమారస్వామి పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి1
1/1

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement