
నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం
లింగాలఘణపురం: ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అందజేయడమే లక్ష్యమని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏరువాక శాస్త్రవేత్త విశ్వతేజ అన్నారు. మంగళవారం మండలంలోని సిరిపురం రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మూలవిత్తనాలను రైతులకు ఇచ్చి వాటి నుంచి విత్తనోత్పత్తి చేసి ఆ విత్తనాలను గ్రామంలోని రైతులకు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా మండలానికి 28 వరి విత్తన ప్యాకెట్లు, 14 పెసర కిట్లు పంపిణీ చేశామన్నారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకొని విత్తనాలను ఉత్పత్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓలు స్పందన, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందజేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వరి, పెసర విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతులు పొందిన విత్తనాలు సాగు చేసి తిరిగి గ్రామ రైతులకు విత్తనోత్పత్తి కోసం విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఓ వసంత సుగుణ, ఏఓ శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, ఏఈఓ కల్యాణి పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం