
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్వాడొద్దు
రఘునాథపల్లి: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్ వాడకుండా విద్యార్థులతో సమయం గడపాల ని వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచించారు. జనగామ మండలం యశ్యంతాపూర్ సీజేఐటీలో శనివారం జరిగిన ఉపాధ్యాయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభు త్వ పాఠశాలల బలోపేతానికి సర్కారు కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని పేర్కొన్నారు. డీఈఓ భోజన్న, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య