చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధి లో శనివారం ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో స్వామివారి వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. భక్తులకు వికారాబాద్ జిల్లా యాలాలకు చెందిన సిద్దాల శ్రీనివాస్–సులోచన, శ్రవణ్కుమార్–సారిక అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గోలి రాజశేఖర్, గణగోని రమేశ్, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, లక్ష్మి, మల్లికార్జున్, హరిశంకర్, వసంత, మహేశ్, గాదె శేఖర్, రాజేశ్, విశాల్, కృష్ణ పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామాలుగా
తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
జనగామ రూరల్: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పార్టీ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాద వ్ అన్నారు. మండల పరిధి శామీర్పేట గ్రా మంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చిన రూ.10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం వారు ప్రారంభించి మా ట్లాడారు. బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాల్నే సుధాకర్, కడకంచి లక్ష్మీవీరమల్లు, తాండ్ర కౌసల్య, కాంసాని భాస్కర్రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, తాండ్ర ప్రవీణ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాలను
మరింత బలోపేతం చేయాలి
పాలకుర్తి: ప్రజలకు మేలు చేసే సహకార సంఘాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా సహకార అధికారి వై.రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఎల్లరాయని తొర్రూరు సహకార సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని చైర్మన్ గోనె మైసిరెడ్డి, సొసైటీ సీఈఓ మాసంపల్లి రణధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈరవెన్ను, ఎల్ల రాయని తొర్రూరు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు సెంటర్లను రాజేందర్రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడారు.
సప్లిమెంటరీ పరీక్షలకు
86 మంది విద్యార్థుల గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 86 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫస్టియర్ జనర ల్, ఒకేషనల్ కలిపి 1,762 మంది విద్యార్థుల కు 1,676 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం నిర్వహించి న పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కేసు ఒకటి నమోదైన ట్లు పేర్కొన్నారు.
వైభవంగా వార కల్యాణం
వైభవంగా వార కల్యాణం