
అటవీ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి
● వీడియో కాన్ఫరెన్లో మంత్రి కొండా సురేఖ
న్యూశాయంపేట: అటవీ ప్రాంతాల అభివృద్ధికి ఫారెస్ట్ ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలు సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పంచాయతీరాజ్, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి పూర్వ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో అటవీ సమస్యలపై శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ అటవీ సంరక్షణ, గిరిజనుల అభివృద్ధి అనివార్యమన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు చూడాలని పేర్కొన్నారు.