రాజ్యాంగాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

Mar 26 2025 1:11 AM | Updated on Mar 26 2025 1:09 AM

జనగామ: దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామ్య పాలనకు సంఘటితం కా వాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిలు పునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఆదేశాల మేరకు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, టీపీసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పిలుపు మేరకు పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్‌ జై సంవిధాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొ మ్మూరి, కార్యక్రమ ఇన్‌చార్జ్‌ ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ లకావత్‌ ధన్వంతి, జ్ఞానేశ్వర్‌లు ముఖ్యఅతిథుగా పాల్గొన్నారు. అనంతరం కొమ్మూరి మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన కేంద్రం నాశనం చేసే విధంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. అంతకు ముందు జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు లక్ష్మి నా రాయణనాయక్‌, జనగామ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, నాయకులు డాక్టర్‌ రాజమౌళి, నరసింహరెడ్డి పాల్గొన్నారు.

సంవిధాన్‌ సన్నాహక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement