జనగామ: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ జరుపుకుంటారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పండ్లు తినిపించి దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఇఫ్తార్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలన్ని, మతాలు చెప్పే సందేశం కూడా ఇదేఅన్నారు. పట్టణంలో ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వంతో కొట్లాడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని ముస్లిం కుటుంబాల ఏరియాలో సీసీరోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, నిధులు బరాబర్ రావాల్సిందేనన్నారు. పేద కుటుంబాల్లోని పిల్లల చదువు విషయంలో అండగా ఉంటామన్నారు. రంజాన్న్ పండుగ త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, నాయకులు మసిఉర్ రెహమాన్, ఎండీ సమ్మద్, ఎజాజ్, సలీం, యాకు బ్, ముస్త్యాల దయాకర్, జూకంటి శ్రీశైలం, సేవెల్లి మధు, దేవునూరి సతీష్, తదితరులు ఉన్నారు.
సోదరభావానికి ప్రతీక రంజాన్: కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: రంజాన్ మాసం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని ఏక్ మినార్ మజీద్ వద్ద ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జిల్లా అధ్యక్షుడు జమాల్ షరీఫ్, ఇంజనీర్ మొహమ్మద్ రజా అహ్సన్ ఆధ్వర్యంలో సామూహిక ఇ ఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్లో కలెక్టర్ పా ల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రేమ, సో దరభావం, శాంతి, స్నేహం ఎక్కువగా కనిపిస్తాయన్నారు. హిందూ, ముస్లింల భాగస్వామ్యం సోదరభావానికి నిదర్శనమన్నారు. అనంతరం కలెక్టర్ను ముస్లింలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ మన్నన్ రజీ, జమియత్, జిల్లా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాస్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
మత సామరస్యానికి ప్రతీక రంజాన్