● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: ప్రాధాన్యత కలిగిన రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ రుణాలపై సమీక్షించా రు. వార్షిక ప్రణాళికకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.4569.48 కోట్లు కాగా మూడో త్రైమాసికానికి రూ.3040.59 కోట్లు(66.54 శాతం) పూర్తి చేశామని, వ్యవసాయానికి 70.89 శాతం, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు 71.35 శాతం, ప్రాధాన్యత రంగాలకు 59.31 శాతం రుణా లు ఇచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు. ఈ ఏడాది లక్ష్యం రూ.4045.72 కోట్లకు రూ.2399.62కోట్లు ప్రాధాన్యత రంగాలకు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, మైక్రో, స్మాల్, మీడి యం ఎంటర్ప్రైజెస్ వ్యాపార విస్తరణ, కొత్త ఎంట ర్ ప్రైజెస్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వడానికి మేళా లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి వ్యాపారుల కు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. అనంతరం నాబార్డు 2025–26 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ, నాబార్డ్ ఏజీఎంలు శ్రావ్య, చంద్రశేఖర్, ఎల్డీఎం శ్రీధర్, ఏఓ రామారావునాయక్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల కంట్రోలర్లు, మేనేజర్లు పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం
జనగామ: జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కోషోర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 31వ తేదీ వరకు రుసుము చెల్లించి 25 శాతం రాయితీ పొందడానికి చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,415 మంది దరఖాస్తు చేసుకోగా ఒకేరోజు 200 ప్రొసీడింగ్ కాపీలు అందజేసినట్లు చెప్పారు. మిగతా దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సహాయకేంద్రం–9948187334, పురపాలక సహాయ కేంద్రం–8978207205 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.