జనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీరని అన్యాయం జరిగిందని సాదిక్ ఫౌండేషన్ చై ర్మన్, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ అన్నారు. బుధవారం జనగామ చౌరస్తాలో డిగ్రీ విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యారంగానికి మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయింపు చే స్తామని చెప్పి రెండుసార్లు మొత్తం బడ్జెట్లో 7.5% కేటాయించి మొండి చేయి చూపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ విద్యార్థులు, సాధిక్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ