
నీటిపారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటి పారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం, భూసేకరణ వందశాతం జరగాలంటే నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 70 శాతం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలంటే ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు సాగు పెంచాలంటే నిధుల కేటాయింపు అధికంగా ఉండాలి.
–గోపు బాలశౌరెడ్డి, గుంటూరుపల్లి,
నర్మెట, జనగామ జిల్లా