జనగామ రూరల్: పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశా రు. మంగళవారం జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎం అనేక పోరాటాలతో ఇల్లు లేని నిరుపేదలకు అధికారులతో స్థలా లను లేఅవుట్ చేయించి అందజేశామన్నారు. ఆ స్థలంలో పేదలు ఇల్లు నిర్మించుకున్నారన్నారు. వా టికి ఇంటి నంబర్లు కేటాయించాలని అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. ఇప్పటికై న ఇంటినంబ ర్లు కేటాయించి, విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయించాలని కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కార్యదర్శి వర్గ స భ్యుడు ఈర్రి అహల్య, బొట్ల శేఖర్, బూడిది గోపి, గణేష్, కళ్యాణం లింగం, నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి