చిల్పూరు: రైతు ఉత్పత్తి సంస్థలతోనే రైతులను భలోపేతం చేయాలని నాబార్డు రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వినోద్ దేశ్ముఖ్ అన్నారు. మండలంలోని రాజవరం గ్రామంలో నాబార్డు సౌజన్యంతో జనవికాస గ్రామీణ అబివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 522 మంది రైతులతో ఏర్పాటు చేసిన రాజవరం రైతు ఉత్పత్తి దారుల సంస్థను మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఏపీఓ చేస్తున్న బిజినెస్ గురించి సంస్థ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ సీఈఓ పెండ్లి సంపత్కుమార్, సంస్థ చైర్మన్ కాల్వ కృష్ణారెడ్డి, డైరెక్టర్లు కుమారస్వామి, రమాదేవి, గట్టయ్య, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
నాబార్డు రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్
మేనేజర్ వినోద్ దేశ్ముఖ్