వల్మిడి ఆదాయం రూ.4,91,000 | - | Sakshi
Sakshi News home page

వల్మిడి ఆదాయం రూ.4,91,000

Mar 14 2025 1:38 AM | Updated on Mar 14 2025 1:39 AM

పాలకుర్తి టౌన్‌: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2025–2026 సంవత్సరం కొబ్బరికాయలు పూజా సామగ్రి, లడ్డు, పులి హోర, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం బహిరంగ వేలం ద్వారా రూ.4,91,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీల్డ్‌ టెండర్‌ కం బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు పూజా సామగ్రి అమ్ముకునే హక్కు పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ముద్రబోయిన సంతోష్‌కుమార్‌ రూ.2 లక్షలకు దక్కుంచుకోగా, లడ్డు పులిహోర అమ్ముకునే హక్కు వల్మిడి గ్రామానికి చెందిన తాళ్ల నవీన్‌ రూ.2,60,000కు దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు రాయపర్తి మండలం కొండూరు గ్రామా నికి చెందిన పల్లు ఎల్లగౌడ్‌ రూ.31,000కు పొందినట్లు వెల్లడించారు. దేవాదాయ దర్శాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు ఎంపిక

చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్యన, చిర్ర వరుణ్‌, సాదం హాసిని, జీడి ప్రీతి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మనోజ్‌కుమార్‌ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో 100, 400 మీటర్ల పరుగు, జావలిన్‌ త్రో లో నిర్వహించిన ఎంపికల్లో విద్యార్థలు ప్రతిభ కనబరిచినట్లు తెలిపా రు. ఈనెల 23న హైదరాబాద్‌ గచ్చిబౌళిలోని గార్డియన్‌ స్పోర్ట్స్‌లో నిర్వహించే పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. హెచ్‌ఎం కేతిడి నర్సింహారెడ్డి, పీడీ దేవ్‌సింగ్‌, చిల్పూరు ఆలయ చైర్మన్‌ శ్రీధర్‌రావు, పీఏసీ ఎస్‌ వైస్‌ చైర్మన్‌ చిర్ర నాగరాజు అభినందించారు.

ఘనంగా రథోత్సవం

చిల్పూరు: ఈనెల 06 నుంచి 15వ తేదీవరకు నిర్వహించే బుగులు వేంకటేశ్వరస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం హోమం, బలిహరణం కార్యక్రమాలను అర్చకుల వేద మంత్రాల నడుమ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు, అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ప్రారంభించారు. భక్తుల కోలాటాల నడుమ స్వామివారి రథయాత్ర సాగింది. కార్యక్రమంలో కుర్రెంల మోహన్‌, వీరన్న, మల్ల్లికార్జున్‌, మహేశ్‌, హరి శంకర్‌, రాజేశ్‌, విశాల్‌, మూల నాగరాజు, నారగోని రాజు, గోలి రాజశేఖర్‌, గనగోని రమేష్‌, తాళ్లపల్లి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పండుగ

జరుపుకోవాలి

జనగామ: జిల్లాలో హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌ పిలుపునిచ్చారు. పట్టణ పోలీస్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ హోలీ రో జు స్నేహభావాన్ని పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాజన్‌బాబు, లక్ష్మీనర్సయ్య, కీర్తి నర్సయ్య, మహంకాళి హరిచంద్రగుప్త, పెద్దోజు జగదీష్‌, శ్రీనివాస్‌, సంతోష్‌, నవీన్‌, న్యాయవాది జమాల్‌షరీఫ్‌, మసిఉర్‌ రెహమాన్‌, అబ్దుల్‌ ఖాదర్‌ అజర్‌, స్కైలాష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

వల్మిడి ఆదాయం రూ.4,91,000 
1
1/3

వల్మిడి ఆదాయం రూ.4,91,000

వల్మిడి ఆదాయం రూ.4,91,000 
2
2/3

వల్మిడి ఆదాయం రూ.4,91,000

వల్మిడి ఆదాయం రూ.4,91,000 
3
3/3

వల్మిడి ఆదాయం రూ.4,91,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement