పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి

Mar 11 2025 1:20 AM | Updated on Mar 11 2025 1:18 AM

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన కమిషనర్‌గా సన్‌ప్రీత్‌ సింగ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌గా పూర్వ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్‌ కిషోర్‌ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ఇరువై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తు తం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్‌ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్‌ సలీ మా, రాజమహేంద్రనాయక్‌, అంకిత్‌ కుమార్‌, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేష్‌ కుమార్‌, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.

24 గంటలు ప్రజలకు అందుబాటులో

నూతన సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

బాధ్యతల స్వీకరణ

పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి 1
1/1

పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement