అందరి కృషితో మెరుగైన ఫలితాలు సాధించాం. 98.87 శాతంతో రాష్ట్రంలో రెండోసారి నాల్గో స్థానంలో నిలిచాం. ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణంగా నిలిచింది. – సత్యప్రసాద్, కలెక్టర్
ప్రణాళిక ప్రకారం ముందుకు..
పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. కలెక్టర్ చొరవ ప్రత్యేకం. ముఖాముఖీ నిర్వహించారు. సబ్జెక్ట్ల వారిగా సలహాలు ఇచ్చారు. వారిలో భయం పోగొట్టారు. – రాము, డీఈవో


