నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

May 30 2025 1:46 AM | Updated on May 30 2025 1:46 AM

నేరాల

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

జగిత్యాలక్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతి, తాజా నేరాల విశ్లేషణ, నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రాత్రివేళల్లో గస్తీ బలోపేతం, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్‌, అసాంఘిక కార్యకలాపాలపై సమీక్షించారు. బక్రీద్‌ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గోవధ, గోవుల అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గోదావరి పరీవాహక రైతులకు నకిలీ పత్తి విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేసి అమ్మకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్‌, రాములు, రంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా

బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

నేర సమీక్షలో ఎస్పీ అశోక్‌కుమార్‌

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు 1
1/1

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement