
కేబుళ్లతో వినియోగదారులకు ముప్పు వాటిల్లొద్దు
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు వైర్లను కడుతుండటంతో వినియోగదారుల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం కేబుల్ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. టీవీ కేబుల్, ఇంటర్నెట్ సేవలందించే ఆపరేటర్లు స్తంభాలకు ఇష్టారీతిన వైర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. అద్దె చెల్లించాలని, క్రమబద్ధీకరణ తప్పనిసరి చేయాలని, కేబుళ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించారు. కేబుళ్లు అన్నింటిని బంచ్ చేసి క్లాంప్స్ అమర్చాలన్నారు. డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియనాయక్