
అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలి
మెట్పల్లి: హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి సారించాలని, పెద్ద సంఖ్య లో మొక్కలు నాటాలని ఆదనపు కలెక్టర్, ము న్సిపల్ స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత అధికారుల కు సూచించారు. రేగుంటలోని నర్సరీ, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద పూలు, పండ్లు మొక్కలు నాటాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్, డీఈఈ నాగేశ్వర్రావు తదితరులున్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
వెల్గటూర్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వెల్గటూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, వాహనాల పార్కింగ్, 5ఎస్ అమలు తీరు, సిబ్బంది డ్యూటీ వివరాలు తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి చూపాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, నేరాలు నియంత్రించాలని పేర్కొన్నారు. యాక్సిడెంట్ జోన్లు గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, ఎస్సైలు ఉమాసాగర్, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదివాసీలపై హత్యాకాండ ఆపాలి
జగిత్యాలటౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న హత్యాకాండను ఆపాలని ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. వామపక్ష, ప్రజాతంత్ర, అంబేడ్కర్వాదుల, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ ఆపాలని, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్, పౌరహక్కుల సంఘం నాయకులు పొన్నం రాజమల్లు, పిట్టల నారాయణ, చింత భూమయ్య పాల్గొన్నారు.
ఈనెల 29, 30న భారీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈనెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మీ తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 10 జిల్లాలో ప్రవేశించాల్సి ఉండగా 15 రోజుల ముందుగానే వచ్చాయని వివరించారు. కొడిమ్యాలలో మంగళవారం ఒక్క గంటలోనే 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
జగిత్యాల: పరిశుభ్రత అందరి బాధ్యత అని, వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ స్పందన అన్నారు. మంగళవారం పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉన్న పెద్ద నాలాను కార్మికులచే శుభ్రం చేయించామని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, మహేశ్వర్రెడ్డి, రాము ఉన్నారు.

అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలి

అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలి

అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలి