
మార్కెట్ను వినియోగంలోకి తెస్తాం
ధర్మపురి: పట్టణంలో రూ.కోట్లాది నిధులతో ఏర్పాటు చేసిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ను వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సమీకృత మార్కెట్ను శనివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. లోపల గద్దెలు ఎత్తుగా ఉండడంతో ఉపయోగంగా లేవని, వాటిని తొలగించి తిరిగి నిర్మిస్తామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2కోట్లు ఖర్చు చేశానని, అమృత్ ట్యాంక్ పనులు వచ్చే వేసవి నాటికి పూర్తవుతుందని తెలిపారు. అనంతరం పలు చలివేంద్రాలను ప్రారంభించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, కాంగ్రెస్ నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్, చిలుముల లక్ష్మణ్, ముస్లిం కమిటీ నాయకులు జహంగీర్, రఫియోద్దీన్ తదితరులున్నారు.