వివరాలు 8లో
ఇళ్ల నిర్మాణాల అనుమతులకు బిల్డ్ నౌ
● ఏఐ ఆధారిత వ్యవస్థతో.. ● కొత్త విధానం ప్రారంభం
జగిత్యాల: భవనాల నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆధునాతన సాంకేతికతతో రూపొందించిన బిల్డ్ నౌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గత నెలలోనే మెట్రో నగరంలో ఏఐ సాంకేతికతతో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తాజాగా మున్సిపాలిటీల్లోనూ అమలవుతోంది. కృత్రిమ మేథా సాంకేతికతతో ఇంటి నిర్మాణ అనుమతులు పొందడంలో సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ఉండేది. ఇంటి అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ విధానాన్ని రద్దు చేసి బిల్డ్ నౌ తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత వ్యవస్థతో బ్లాక్ చైన్, రియాల్టీ, ఆటోమేషన్ వంటివి తీసుకొచ్చారు. ఇందులో ఇంటి నిర్మాణ స్థలం, లేఅవుట్ సరిహద్దులను తెలుసుకునేందుకు జీపీఎస్ ఆధారిత పటాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన ఇంటి నిర్మాణ దరఖాస్తు ఏ స్టేజీలో ఉందని వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఏవైనా తప్పుడు దరఖాస్తులు చేసుకున్నా మళ్లీ సవరించుకునే అవకాశం కల్పించారు. భవన నిర్మాణాలకు సంబంధించి పరిశీలనకు వెళ్తే ఏఐ ఆధారంగా రెండు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వీడియో ద్వారా వీక్షించే అవకాశం ఉంది. ఇందులో హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంది.
అనుమతి 15 రోజుల్లోనే...
500 చదరపు మీటర్లలోపు భవనం నిర్మాణం చేపడితే 15 రోజుల్లోనే అనుమతులు జారీ చేయనున్నారు. 500కు పైగా ఉంటే 21 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు ఈ మేరకు గురువారం నుంచి బిల్డ్ నౌ ద్వారానే అనుమతులు జారీ చేస్తున్నారు.
ఏఐ సాంకేతికతతో
ఏఐ సాంకేతికతతో బిల్డ్నౌ విధానంలో ఇంటి అనుమతులు ఇవ్వనున్నాం. పాత టీఎస్ బీపాస్ రద్దు అయింది. ప్రస్తుతం జిల్లాలో ఈ కొత్త బిల్డ్నౌ ద్వారానే అనుమతులు లభించనున్నాయి.
– శ్రీనివాస్, టీపీవో
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె శాతవాహనలో న్యాయ విద్య
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె శాతవాహనలో న్యాయ విద్య