South Korea: కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా..

South Korea: Nine Expired As Building Collapses On To Bus In Gwangju - Sakshi

బస్సుపై పడిన భవన శకలాలు 

9 మంది ప్రయాణికుల మృతి, 8 మందికి గాయాలు

సియోల్‌: దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జు నగరంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనాన్ని కూలి్చవేస్తుండగా శకలాలు ఓ బస్సుపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా మారారు. 8 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. కూలి్చవేస్తున్న ఐదంతస్తుల భవనం పక్క వీధిలోనే ఈ బస్సు నిలిచి ఉంది. భారీ కాంక్రీటు శకలాలు నేరుగా బస్సుపై పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top