పలు దేశాల్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలు

New Covid Cases Worldwide Russia Sets Record Cases - Sakshi

భారత్‌లోనూ పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

నవంబర్‌ 30 దాకా ‘కంటైన్మెంట్‌’చర్యలు పొడిగించిన కేంద్రం

మ్యుటేషన్‌ ఏవై.4.2 జాడలు భారత్‌లో తక్కువే

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. యూకే, చైనా, రష్యా, అమెరికా, సింగపూర్, ఐరోపాలో ముఖ్యంగా తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్‌ కేసుల వృద్ధి నమోదవుతున్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కరోనా తాజా వైరస్‌ వేరియెంట్‌ మ్యుటేషన్‌ ఏవై. 4.2 కారణమని వెల్లడైంది. రష్యా, యూకే, సింగపూర్‌, చైనాల్లో భారీగా కొత్త వేరియెంట్‌ కేసులు భారీ స్థాయిలో నమోదు కావడం మళ్లీ కలవరపెడుతోంది. రష్యాలో రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదు కావడం, క్రమెపీ పెరుగుతూ పోవడంతో అక్కడ మరోసారి భయానక పరిస్థితి నెలకొంది. యూకేలో 50వేలకు పైగా ఏవై. 4.2 కేసులు రావడం, జూలై నెల తర్వాత అత్యధిక కేసులు రావడంతో ఆందోళన కల్గిస్తోంది. 

అయితే ఈ రకం మ్యుటేషన్‌ భారత్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నా తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 18 కేసులు గుర్తించారు. అయితే దీని వ్యాప్తి, తీవ్రత అంతగా లేనట్లు పేర్కొంటున్నారు. 

పలు రాష్ట్రాల్లో కేసులు నెమ్మదిగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా నవంబర్‌ 30 దాకా జాతీయ స్థాయిలో కోవిడ్‌ ‘కంటైన్మెంట్‌’చర్యలను పొడిగిస్తూ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా పాటిస్తూ వచ్చిన కరోనా నియంత్రణ చర్యలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదేశించారు. ప్రస్తుత పండుగల సీజన్‌లో అన్ని జాగ్రత్తలు పాటించి కేసుల పెరుగుదల, వ్యాప్తి జరగకుండా చూడాలని సూచించారు. ఇటీవల హరియాణా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌లో కేసులు పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు మామూలైపోవడంతో గుంపులుగా చేరడం, ఇంటా, బయట, బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగడం, మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కేసులు పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

దేశంలో ఏవై.4.2 వేరియెంట్‌ చాలా తక్కువ 
భారత్‌లో ఏవై. 4.2కు సంబంధించి 18 స్వీక్వెన్సింగ్‌ తీసినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, తెలంగాణలో ఈ కేసులు నమోదయ్యాయి. అయిత మన దగ్గర ఒక శాతం కంటే తక్కువగా ఉంది. గత జూన్‌ మధ్యలోనే దీనికి సంబంధించిన కేసు బయటిపడిందని చెబుతున్నారు. అప్పటినుంచి పెద్ద మొత్తంలో కేసులు లేవు కాబట్టి పెద్దగా ప్రభావం చూపలేదనే భావించాలి. యూకే, తదితర దేశాల్లో ఈ రకం స్ట్రెయిన్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ దేశాల్లో టీకా కార్యక్రమం విషయంలో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండటంతో ఒకే రకమైన వ్యాక్సినేషన్‌ జరగకపోవడం కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే రకంగా టీకాలు వేయడం కలిసొచ్చే అంశం. మన దగ్గర జనసాంద్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుత పండుగల సీజన్‌లో మాస్క్‌ వేసుకోవడం, ఇతర జాగ్రత్తలు తీసుకుని కరోనా ప్రమాదకరమైన మ్యుటేషన్లుగా మారకుండా అప్రమత్తంగా ఉండాలి. 
– డా.కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ 
విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రి
 

వారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. 
వారం రోజుల నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దసరా తర్వాత పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది. ప్రస్తుత పండుగల సీజన్‌లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. టీకాలు వేసుకున్నా కోమార్బిడిటీస్‌ ఉన్న వారిలో సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోని వారిలోనే మరణాలు పెరుగుతున్నాయి. మేం సీసీఎంబీతో కలసి రెగ్యులర్‌గా శ్యాంపిల్స్‌పై జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నాం. మన దగ్గర ఇంకా డెల్టా వేరియెంటే బలంగా ఉంది. ప్రస్తుతం కేసులు వస్తున్నా అవి సీరియస్‌గా మారడం లేదు. మరో 3 నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
– డా.విశ్వనాథ్‌ గెల్లా, డైరెక్టర్‌ పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్, ఏఐజీ హాస్పిటల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ...



 

Read also in:
Back to Top