ఇజ్రాయిల్ దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు హతం | Journalists killed in Israeli attack | Sakshi
Sakshi News home page

ఇజ్రాయిల్ దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు హతం

Mar 29 2026 1:00 AM | Updated on Mar 29 2026 1:04 AM

Journalists killed in Israeli attack

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్లు ఆదేశ సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంపైకి కంబాట్‌ ఆపరేషన్ చేపడుతూ పెద్దఎ‍త్తున హిజ్బుల్లా ఫైటర్స్‌ను హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దాదాపు 400కు పైగా హిజ్బుల్లా ఫైటర్స్‌ అంతం చేసినట్లు ప్రకటించింది. తాజాగా శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది.  

హిజ్బుల్లాకు చెందిన ఛానెల్‌ షుయబ్-అల్- మనార్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టుతో పాటు మరో మహిళా జర్నలిస్టు, కెమెరామెన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన జర్నలిస్టు దశాబ్దకాలంగా యుద్ధవార్తలు కథనాలు ప్రచురిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ దాడులను లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కాగా 2023 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది పాత్రికేయులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement