ఉద్యోగుల అభ్యున్నతికి టీఎన్జీఓస్‌ కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల అభ్యున్నతికి టీఎన్జీఓస్‌ కృషి

May 24 2024 1:50 PM | Updated on May 24 2024 1:50 PM

ఉద్యోగుల అభ్యున్నతికి టీఎన్జీఓస్‌ కృషి

ఉద్యోగుల అభ్యున్నతికి టీఎన్జీఓస్‌ కృషి

అబిడ్స్‌: ఉద్యోగుల అభ్యున్నతికి టీఎన్జీఓస్‌ యూనియన్‌ ప్రత్యేక కృషి చేస్తుందని హైదరాబాద్‌ జిల్లా టీఎన్జీఓస్‌ అధ్యక్షుడు ఎస్‌ఎం.ముజీబ్‌ హుస్సేని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముజీబ్‌ హుస్సేన్‌ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా గెలిపించాలని కోరుతూ పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఉద్యోగులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎం.ముజీబ్‌ హుస్సేని మాట్లాడుతూ..ఉద్యోగులకు 24 గంటల పాటు అండగా ఉండి విశేష సేవలందిస్తున్న తనను కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే తన ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. పీవీ నర్సింహారావు వెటర్నరి యూనివర్సిటీ అధ్యక్షుడు మహ్మద్‌ షరీపుద్దీన్‌ మాట్లాడుతూ..ఉద్యోగులందరూ ముజీబ్‌ హుస్సేన్‌ను కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జి.ఆంజనేయులు, టి.నర్సింహ, మధుసూదన్‌, టి.రాజ్‌కుమార్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కేంద్ర సంఘం నాయకులు మారం జగదీశ్వర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ముజీబ్‌ హుస్సేని సేవలను గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement