
మత్తుకు బానిస కావొద్దు..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్
హసన్పర్తి: యువత మత్తుకు బానిస కావొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు అంధకారమవుతాయన్నారు. డ్రగ్స్ విక్రయించిన, ఖరీదు చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వరంగల్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాదక ద్రవ్యాలను తరిమికొడుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీయా, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎస్వీఎస్ కళాశాల సెక్రటరీ ఎర్రబెల్లి అనూప్, ఇన్స్పెక్టర్లు రవికుమార్, శివకుమార్, రంజిత్కుమార్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ రవికుమార్, అనిత, ఎస్సై రవీందర్, శ్రీకాంత్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తుకు బానిస కావొద్దు..