
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ షురూ!
హన్మకొండ: పీఎం కుసుం పథకంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కార్యక్రమం షురూ అయ్యింది. టీజీ ఎన్పీడీసీఎల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సోమవారం హనుమకొండలోని కంపెనీ కా ర్యాలయంలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభీయాన్ (పీఎం కుసుం) పథకం తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పు నరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వా రా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు ఉ త్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి స్థలం 33/11 కేవీ సబ్ స్టేషన్కు 5 కిలో మీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలి. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలా ర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యా ప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉ త్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వెయ్యి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మె గావాట్లు రైతులతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చే యించి ఉత్పత్తి చేయాలదే ఈ పథం ఉద్దేశం. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల పరిధిలో దరఖాస్తు చేసుకుని రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించిన 461 మందికి రెడ్ కో లెటర్ ఆఫ్ ఆక్సెప్టెనీ జారీ చేసింది. వీరితో ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కాగా, మొదటి రోజు 80కి పైగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగాయి. ఈ కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ కె.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీల్ ప్రధాన
కార్యాలయంలో ప్రారంభం
తొలి రోజు 80కి పైగా పీపీఏలు
రెండు రోజుల పాటు కొనసాగింపు