ఆరు గ్యారంటీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

May 4 2025 8:14 AM | Updated on May 4 2025 8:14 AM

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

హసన్‌పర్తి: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, కొత్త రేషన్‌ కార్డులతో పాటు జీరో కరెంట్‌ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరారు. తొలుత, కశ్మీర్‌లో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో నాయకులు పుల్లా అశోక్‌, గుమ్మడి రాములు, మంద సుచేందర్‌, వేలు సుమన్‌, రజిత, పద్మ, మౌనిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement