ఖరీఫ్‌లో ‘ముంపు’ ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌లో ‘ముంపు’ ముప్పు

Jul 3 2025 5:31 AM | Updated on Jul 3 2025 5:31 AM

ఖరీఫ్‌లో ‘ముంపు’ ముప్పు

ఖరీఫ్‌లో ‘ముంపు’ ముప్పు

రేపల్లె: ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా పాలకులు, అధికారులు పూడికతీతపై నోరు మెదపడం లేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌కు ముందే డ్రెయిన్‌లలో తూటికాడ, గుర్రపు డెక్కలను తొలగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

రేపల్లె సబ్‌ డివిజన్‌లో ఇలా...

రేపల్లె సబ్‌ డివిజన్‌లో ప్రధానంగా ఆర్‌ఎం డ్రెయిన్‌, బీఎం డ్రెయిన్‌, జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడ మురుగు డ్రెయిన్‌, రేపల్లె న్యూకోర్స్‌, ఓల్డ్‌ కోర్స్‌లలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్‌, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. నియోజకవర్గంలో34,060 హెక్టారులలో ఖరీఫ్‌లో వరి సాగు అవుతుంది. వృథా నీరు, అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద ఈ కాల్వల ద్వారానే ముందుకు పో వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. పంట చివరి దశ నవంబర్‌, డిసెంబరు మాసాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షం పడుతుంది. దీంతో రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు.

యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే..

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూడికతీత చేపట్టకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో కురిసిన వర్షాలతో కొంతమేర నష్టపోయారు. ఇప్పటికై నా యుద్ధప్రాతిపదికన పూడిక తీత ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement