ప్రణమిల్లిన భక్త జనం | - | Sakshi
Sakshi News home page

ప్రణమిల్లిన భక్త జనం

Jun 28 2025 5:47 AM | Updated on Jun 28 2025 7:35 AM

ప్రణమ

ప్రణమిల్లిన భక్త జనం

అమ్మవారి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమ ర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది.

కిటకిటలాడిన క్యూలైన్లు

ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్‌తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్‌ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.

మౌలిక వసతుల పరిశీలన

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను నోడల్‌ అధికారి టి.చంద్రకుమార్‌ పరిశీలించారు. ఆయన వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్‌, ఆలయ అధికారులు ఉన్నారు.

ప్రణమిల్లిన భక్త జనం 1
1/2

ప్రణమిల్లిన భక్త జనం

ప్రణమిల్లిన భక్త జనం 2
2/2

ప్రణమిల్లిన భక్త జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement