రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్‌ ! | - | Sakshi
Sakshi News home page

రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్‌ !

Jun 26 2025 6:47 AM | Updated on Jun 26 2025 6:47 AM

రైతన్

రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్‌ !

పత్తి, మిర్చి విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు తప్పనిసరి

ప్రత్తిపాడు: కొద్ది రోజుల్లో ఖరీఫ్‌ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో విత్తనాల కొనుగోలు సమయంలో రైతులంతా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

● వ్యవసాయశాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.

● కొనే సమయంలో వ్యాపారి నుంచి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

● జిన్నింగ్‌ లేదా లూజుగా ఉన్న పత్తి విత్తనాలు, కంపెనీ పేరు లేని ప్యాకెట్లు కొనకూడదు.

● పగిలిన ప్యాకెట్లు, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు.

● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నంబరు, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్‌ నంబరు, గడువు తేదీ, నికర తూకం, నికర ధరతో పాటు కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పై వివరాలన్నీ ఉంటేనే రైతులు బిల్లును తీసుకోవాలి.

● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్‌, సంచులపై కంపెనీ సీలు ఉన్నదో లేదో గమనించుకోవాలి.

● విక్రయదారుడు ఇచ్చిన బిల్లును పంట కాలం పూర్తయ్యేవరకు భద్రపరుచుకోవాలి.

● అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లును మాత్రం కచ్చితంగా అడిగి తీసుకోవాలి.

● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని పరిశీలించాలి.

● సంతృప్తిగా ఉన్న విత్తన రకాలనే వాడాలి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే వీలుంటుంది.

గతంలో ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు

2019కు ముందు వరకు నకిలీల బెడద రైతులను తీవ్రంగా వెంటాడేది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నకిలీల బారిన పడకుండా రైతాంగాన్ని కాపాడేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే వాటి ద్వారా భరోసా, గ్యారెంటీ ఇస్తూ నాణ్యమైన, రాజీలేని ఉత్పత్తులను అందించింది. దీంతో రైతులు ఆయా కేంద్రాల ద్వారానే పత్తి, మిర్చి విత్తనాలను కొనుగోలు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత రైతుభరోసా కేంద్రాల పేరును మార్చి రైతు సేవ కేంద్రాలుగా నిర్వహిస్తున్నప్పటికీ అందులో సేవలు మాత్రం శూన్యమనే చెప్పాలి.

లైసెన్సు ఉన్న వారి నుంచే కొనాలి

విత్తనాలను కచ్చితంగా లైసెన్సు ఉన్న అధీకృత డీలరు వద్దే కొనుగోలు చేయాలి. ఈ సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకుని డీలరుతో సంతకం చేయించుకోవాలి. రైతు కూడా బిల్లుపై సంతకం చేయాలి. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లుతో పాటు విత్తనాల ప్యాకెట్‌ కవరును భద్రపరుచుకోవాలి. రైతులు నకిలీల బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం. దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు చేపడతాం.

– షేక్‌ సుగుణా బేగం (ఏవో, ప్రత్తిపాడు)

రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్‌ ! 1
1/1

రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement