రేపు సీఎం చంద్రబాబు రాక | - | Sakshi
Sakshi News home page

రేపు సీఎం చంద్రబాబు రాక

Jun 26 2025 6:47 AM | Updated on Jun 26 2025 6:47 AM

రేపు సీఎం చంద్రబాబు రాక

రేపు సీఎం చంద్రబాబు రాక

ఏర్పాట్లను పరిశీలించిన అధికారుల బృందం

ప్రత్తిపాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలకు రానున్నారు. ఏపీ పోలీస్‌ శాఖ ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో బుధవారం కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి పాటు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హ్యకథాన్‌ జరిగే కార్యక్రమ వివరాలపై ఐటీ రంగ నిపుణులతో, కళాశాల సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ మధుసూదనరెడ్డి, ఐజీ శ్రీకాంత్‌, ఎస్పీ పి. సతీష్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ సంజన సింహా, గుంటూరు నగర కమిషనర్‌ పులి శ్రీనివాస్‌, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ పి. వెంకటేశ్వరరావు, గుంటూరు నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్ర, డీఎంహెచ్‌వో కె.విజయలక్ష్మి, ఎలక్ట్రికల్‌ ఈఈ శ్రీనివాస్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ కొల్లా శ్రీనివాస్‌, అకడమిక్‌ అండ్‌ ఆర్‌డీ డైరెక్టర్‌ కె.రవీంద్ర, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దుగ్గిరాలలో 16.4 మి.మీ. వర్షం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 16.4 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 2.6 మి.మీ. పడింది. సగటున 6.9 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి మండలంలో 10 మి.మీ., కొల్లిపర 9.2, తుళ్ల్లూరు 8.8, చేబ్రోలు 8.2, ప్రత్తిపాడు 7.8, తాడేపల్లి 7.6, మంగళగిరి 7.4, తాడికొండ 6.4, పెదకాకాని 6.2, గుంటూరు తూర్పు 6, గుంటూరు పశ్చిమ 5.6, పెదనందిపాడు 5.6, వట్టిచెరుకూరు 5, ఫిరంగిపురం 4.4, కాకుమాను 4, మేడికొండూరు మండలంలో 3.2 మి.మీ. చొప్పున వర్షం పడింది.

డెప్యూటీ తహసీల్దార్లు బదిలీ

నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్‌ సాల్మన్‌ను నాదెండ్లకు, ఎస్‌.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు, బి.సు బ్బారావును శావల్యాపురానికికు, పి.తులసీరామ్‌ను నూజెండ్లకు, జి.వెంకటరమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్‌ నాయక్‌ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాలవెంకటేష్‌ను ముప్పాళ్లకు, ఎన్‌.అనూరాధను యడ్లపాడుకు, షేక్‌ బాషా ను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్‌.లక్ష్మీప్రసాద్‌ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్‌ను కారంపూడికి బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement